న్యూఢిల్లీ:పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సోమవారం ఎదురు దెబ్బ తగిలింది. సందేశ్ఖాలీలో జనవరి 5న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై జరిగిన దాడి కేసులో దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఈ నెల 5న ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను ధర్మాసనం తొలగించింది.