కోల్కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలు సక్రమంగా అమలు కాకుండా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బీర్భూమ్ జిల్లాలో ఆదివారం జరిగిన ప్రజా పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఆధార్ కార్డులను మోదీ సర్కారు డీయాక్టివేట్ చేసిందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజలు ఉచిత రేషన్, బ్యాంకుల ద్వారా లక్ష్మీ భండార్ పథకం ప్రయోజనాలను పొందకూడదనేదే కేంద్రం ఉద్దేశమని, దీనిని తెలుసుకోవాలని ప్రజలను కోరారు. తన ప్రభుత్వం ఆధార్ కార్డు లేనివారికి సైతం పథకాలను అందించడం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు.