న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు మల్లికార్జున్ ఖర్గే కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని ఖర్గే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకొని, జాగ్రత్తలు తీసుకోవాలని ఖర్గే సూచించారు. నిన్న రాజ్యసభ సమావేశాలకు ఖర్గే హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీడ్కోలు కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. వీడ్కోలు సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు నాయకులు హాజరైన విషయం తెలిసిందే.
I have tested positive for #COVID19.
I request those who came in contact with me recently to to take care.
— Mallikarjun Kharge (@kharge) August 9, 2022