Mallika Rajput | ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ గాయని, సినీ నటి విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పుత్ సుల్తాన్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఆమె మృతికి కారణమని తెలుస్తున్నది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
సుల్తాన్పూర్ నగర్ కొత్వాలి ప్రాంతంలోని సీతాకుండ్లోని ఆమె నివాసం ఉన్న ఇంట్లో ఆమె మృతదేహం మంగళవారం లభ్యమైంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. అయితే పరిస్థితి అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాథమిక విచారణలో మల్లికా రాజ్ పుత్ కు కుటుంబ తగాదాలు ఉన్నట్లు తెలిసిందని పోలీసులు ప్రకటించారు. 40 ఏళ్ల మల్లికా రాజ్పుత్ ఎల్ఎల్బీ చదివారు. ఆమె రచయిత కూడా. ప్రధాని నరేంద్ర మోదీపై ‘నమో శాసక్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈ పుస్తకం విస్తృతంగా చర్చ నీయాంశమైంది.