మధ్యప్రదేశ్లోని డుమ్నా ఎయిర్పోర్టులో ఎయిరిండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. రన్వేపై దిగుతున్న సమయంలో ఈ విమానం ఒక్కసారిగా అదుపు తప్పింది. అయితే ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఢిల్లీ నుంచి బయల్దేరిన ఈ విమానం జబల్పూర్లోని డుమ్నా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో అదుపు తప్పింది.
ల్యాండ్ అయ్యే సమయంలో ఆ విమానం చక్రం రన్వేపై కాకుండా పక్కకు వచ్చింది. దీంతో ప్రయాణికులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకున్న పైలట్ చాకచక్యంతో ఆ టైర్ను మళ్లీ రన్వేపై తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో ఎయిరిండియా విమానంలో 54 మంది ప్రయాణికులున్నారు.