కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో ప్రశ్నలు వేసేందుకు ఆమె ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఆమెను లోక్సభ సభ్యత్వం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నది. అయితే ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తొలిసారి మౌనం వీడారు. ఎంపీ మహువా మొయిత్రాను కావాలనే టార్గెట్ చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్లాన్ ప్రకారం మహువాను తప్పించాలని చూస్తున్నట్లు దీదీ అన్నారు. కానీ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఇది ఆమెకు కలిసి వస్తుందని మమతా బెనర్జీ తెలిపారు. పార్లమెంట్లో ప్రశలు వేసేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందని నుంచి రెండు కోట్ల నగదు, ఖరీదైన గిఫ్ట్ ఐటమ్స్ తీసుకున్నట్లు మహువాపై ఆరోపణలు ఉన్నాయి.