న్యూఢిల్లీ : పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకొన్నారన్న వివాదం టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను వెంటాడుతున్నది. తాజాగా ప్రశ్నలు పోస్టు చేసేందుకు తన పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ వివరాలను తన స్నేహితుడు, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచ్చినట్టు మొయ్రితా అంగీకరించారు. అయి తే సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ దెహద్రాయ్ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించినట్టుగా తాను హీరానందానీ నుంచి డబ్బులు తీసుకోలేదని తాజాగా ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున తాను లాగిన్ వివరాలను ఇతరులతో కూడా పంచుకొన్నానని పేర్కొన్నారు. తనకు ఎప్పటికప్పుడు ఓటీపీ వస్తుందని, ప్రశ్నలను ఒక టీమ్ పోస్టు చేస్తుందని చెప్పారు. .