Mahua Moitra : ఫెమా ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈడీ జారీ చేసిన సమన్లపై టీఎంసీ ఎంపీ, ఆ పార్టీ కృష్ణానగర్ అభ్యర్ధి మహువ మొయిత్ర మరోసారి స్పందించారు. దేశ ప్రజలు, ముఖ్యంగా కృష్ణానగర్ ప్రజలు అంతా గమనిస్తున్నారని, కాషాయ పాలకులు తనను వెంటాడిన ప్రతిసారీ తనకు లభించే ఓట్లు పెరుగుతున్నాయని అన్నారు.
కాగా ఈడీ తనకు జారీ చేసిన సమన్లను ఆమె సీరియస్గా తీసుకోలేదు.ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున తాను ఈడీ విచారణకు హాజరు కాలేనని మహువ మొయిత్ర తేల్చిచెప్పారు. ఈడీ పని ఈడీదైతే తన పని తాను చేసుకుపోతానని ఆమె పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మహిళల సంక్షేమం గురించి పదేపదే మాట్లాడతారని మణిపూర్లో పరిణామాలపై మాత్రం నోరుమెదపరని ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మహువ మొయిత్ర విరుచుకుపడుతున్నారు. మహిళల బాగు కోసం బెంగాల్లో మమతా బెనర్జీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని, మహిళల కోసం ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనేది మహిళలకు తెలుసునని ఆమె పేర్కొన్నారు.
Read More :
Personal Finance | ఆఫీస్ వాళ్లు రూ.5 లక్షల కవరేజీ ఇచ్చాక.. మరో బీమా తీసుకోవడం దేనికి?