న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra).. ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ నోటీసులు జారీ చేసింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎంపీ హోదాలో ఆమెకు ఓ ప్రభుత్వ బంగ్లాను కేటాయించారు. అయితే ఆ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొన్నది. నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఆమె ఇంటిని త్వరలో తనిఖీ చేయనున్నారు.
#WATCH | Trinamool Congress Party (TMC) leader Mahua Moitra gets fresh notice to vacate her Government allotted accommodation in New Delhi.
The notice of Office of the Estate Officer and Assistant Director of Estates (Litigation), Directorate of Estates reads “The Applicant vide… pic.twitter.com/IJAU6GU0yO
— ANI (@ANI) January 17, 2024
గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన టీఎంసీ నేత మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే జనవరి ఏడో తేదీ లోగా ఇంటిని ఖాళీ చేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారు. మళ్లీ జనవరి 8వ తేదీన ఎస్టేట్స్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఇంత వరకు బంగ్లాను ఖాళీ చేయలేదని ప్రశ్నించింది. జనవరి 12వ తేదీ కూడా మరో నోటీసు ఇచ్చారు.
ప్రభుత్వ క్వార్టర్స్లో ఉండాలనుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ శాఖను సంప్రదించాలని జనవరి నాలుగో తేదీన ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. అయితే కొంత రుసుము చెల్లిస్తే ప్రభుత్వ బంగ్లాలో ఆరు నెలల వరకే ఉండే అవకాశం ఉందని జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ తెలిపారు.