న్యూఢిల్లీ: లోక్సభలో ప్రశ్నలు వేసేందుకు డబ్బు తీసుకున్నట్లు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)పై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో స్పందించారు. ప్రధాన మంత్రి కార్యాలయం వ్యాపారవేత్త దర్శన్ హీరానందనిపై వత్తిడి తెచ్చి అఫిడవిట్ సమర్పించేలా చేసిందన్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన హీరానందని గురువారం ఓ అఫిడవిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఎంపీ మొయిత్రా తన పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ను వ్యాపారవేత్త హీరానందనికి ఇచ్చారని, ఆమెను తరపున ఆయన ప్రశ్నలు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అదానీని అటాక్ చేసేందుకు ఆ లాగిన్ ఐడీ, పాస్ట్వర్డ్ తనకు ఆమె ఇచ్చినట్లు అఫిడవిట్లో హీరానందని పేర్కొన్నాడు.
Jai Ma Durga. pic.twitter.com/Z2JsqOARCR
— Mahua Moitra (@MahuaMoitra) October 19, 2023
ఎంపీ మొయిత్రా తన పోస్టులో హీరానందని చేసిన ఆరోపణలను ఖండించారు. ఆయన అఫిడవిట్లో ఉన్నవన్నీ జోకులని పేర్కొన్నారు. పీఎంవోలో ఉన్న వ్యక్తులే ఆ అఫిడవిట్ను రూపొందించినట్లు ఆమె చెప్పారు. బీజేపీ క్రియేటివ్ సెల్లో ఉన్న వ్యక్తులు ఆ లేఖ రాసినట్లు ఆమె ఆరోపించారు. వైట్ పేపర్ మీద అఫిడవిట్ ఉందని, అదేమీ లెటర్హెడ్ కాదు అని తెలిపారు. ఒకవేళ ఆ అఫిడవిడ్ నిజమైతే దాన్ని ఎందుకు ట్వీట్ చేయలేదని ఆమె అడిగారు.