న్యూఢిల్లీ : ఆలిండియా మహిళా కాంగ్రెస్ చీఫ్ నీతా డీసౌజా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడీ విచారణను నిరసిస్తూ.. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నీతా డీసౌజాను కూడా పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించారు. అయితే ఆమె మహిళా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ.. వారిపై ఉమ్మేశారు. డీసౌజా తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.
#WATCH | Mahila Congress President Netta D’Souza spits at police personnel during a protest with party workers in Delhi against ED for questioning Congress leader Rahul Gandhi in the National Herald case. pic.twitter.com/cPBIntJq1p
— ANI (@ANI) June 21, 2022