న్యూఢిల్లీ, డిసెంబర్ 27: జనతాదళ్ (యునైటెడ్) రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్రప్రసాద్ (81) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బీహార్ నుంచి 7 సార్లు రాజ్యసభకు, ఒకసారి లోక్సభకు ఎన్నికయ్యారు. అరిస్టో ఫార్మాస్యూటికల్స్ను ఆయన స్థాపించారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, బీహార్ సీఎం నితీశ్ సంతాపం ప్రకటించారు.