మహా వికాస్ అగాఢీలో మళ్లీ లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇలా లుకలుకలు ప్రారంభమవ్వడం ఇది ముచ్చటగా మూడోసారి. గతంలోనూ ఇవే లుకలుకలు వచ్చాయి. తాజాగా… కాంగ్రెస్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడింది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే నేరుగా ఎన్సీపీపై విరుచుకుపడ్డారు.
ఎన్సీపీ తమను వెన్నుపోటు పొడుస్తోందని పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే తీవ్రంగా విరుచుకుపడ్డారు. అదేదో ముందు వైపు నుంచి చేస్తే.. తాము కూడా అందుకు సిద్ధంగానే వుంటామని సవాల్ విసిరారు. గత రెండున్నరేళ్లుగా తమ పార్టీ కార్యకర్తలను ఎన్సీపీ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కూడా పెట్టుకుందన్నారు.
మహావికాస్ అగాఢీ అంటూనే కొందరు ఎన్సీపీ కీలక నేతలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, తమను వెన్నుపోటు పొడుస్తున్నారని పటోలే తీవ్రంగా మండిపడ్డారు. అందుకే తాము ఎన్సీపీని ప్రశ్నిస్తూనే వుంటామని ప్రకటించారు. ఎన్సీపీ వెన్నుపోటు పొడిచే శత్రువు అంటూ అభివర్ణించారు.
मैत्रीचा हात पुढे करून राष्ट्रवादी काँग्रेस ही भारतीय राष्ट्रीय काँग्रेस पक्षाच्या पाठीत सुरा खुपसण्याचे काम करीत आहे. आमच्या विरोधात त्यांच्या कुरघोड्या सातत्याने सुरू आहेत. याचा जाब आम्ही त्यांना नक्कीच विचारू!#Gondia #Bhandara #Congress #Election #ZillaParishadElections
— Nana Patole (@NANA_PATOLE) May 11, 2022