ముంబై: వేసవి కాలం నేపథ్యంలో ఎండలు మండుతుండటంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా వరకు ఎండిపోయిన ఒక బావి నుంచి నీటిని సేకరించేందుకు ఒక మహిళ పెద్ద సాహసం చేసింది. తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలాంటి ఆధారం లేకుండా ఆ బావిలోకి దిగింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో నీటి కష్టాలకు ఇది అద్దం పడుతున్నది. త్రయంబకేశ్వర్ సమీపంలోని మెట్ఘర్ గ్రామానికి చెందిన ఒక మహిళ తాగు నీటి కోసం ప్రాణాలకు తెగించింది. చాలా వరకు ఎండిపోయిన లోతైన బావిలోకి ఆమె దిగింది. అనంతరం బావి నుంచి పైకి వెళ్లేందుకు చాలా శ్రమించింది.
కాగా, సోహిత్ మిశ్రా అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ గ్రామంలో తాగడానికి నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో తాగు నీటి కోసం మహిళలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यह तस्वीर महाराष्ट्र के त्रयम्बकेश्वर के पास मेटघर गाँव की है…पीने के लिए पानी नहीं है, महिलाएं अपनी जान जोखिम में डाल पानी भर रही हैं.. यह सब 2022 में हो रहा है!
केंद्र बनाम राज्य, हिन्दू मुस्लिम और ईडी-CBI जैसे बड़े मुद्दों के बीच महाराष्ट्र के ऐसे मूलभूत मुद्दे खो गए हैं.. pic.twitter.com/StZI95wKWD— sohit mishra (@sohitmishra99) April 6, 2022