BRS Party | మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శివసేనకు చెందిన కీలక నేత బీఆర్ఎస్ పార్టీలో చేశారు. బీడ్ జిల్లాకు చెందిన దిలీప్ గోరె బుధవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కేసీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దిలీప్ గోరే బీడ్ మున్సిపల్ మేయర్గా పని చేశారు. ప్రస్తుతం శివసేన బీడ్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు జిల్లా పరిధిలో రాజకీయంగా మంచి పట్టుంది. ఆయనతో పాటు మహారాష్ట్ర చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, విద్యాధికుడు శివరాజ్ జనార్థన్ రావు భంగర్ సైతం బీఆర్ఎస్ పార్టీ తీర్థం స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.