ముంబై: మహారాష్ట్రలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఉస్మానాబాద్ జిల్లాలో రెండు కేసులు, ముంబై, బుల్దానాలో ఒక్కొక్క కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మహారాష్ట్రలో కొత్త వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 32కు చేరినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 25 మంది రోగులకు నెగిటివ్ రిపోర్ట్ రాగా డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది.
మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 925 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన వారిలో పది మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 6,467 అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.