Maharashtra | మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 40,925 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 20 మంది కోవిడ్తో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,41,492 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒమిక్రాన్ కేసులు 876 నమోదు కాగా అందులో 435 మంది రికవరీ అయ్యారు. ముంబైలో తాజాగా 20,971 కేసులు నమోదు అయ్యాయి. మంబైలో ప్రస్తుతం 91731 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబైలో 8490 బాధితులు రికవరీ అయ్యారు. మరో ఆరుగురు మృతి చెందారు.