ముంబై: మహారాష్ట్రకు చెందిన పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్ష ఏక్నాథ్ గైక్వాడ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్పంగా జ్వరం రావడంతో వర్ష ఏక్నాథ్ సోమవారం సాయంత్రం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమె సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.
‘నిన్న స్వల్పంగా జ్వరం ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నా. ఆ పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్గా తేలినట్లు ఇవాళ తెలిసింది. ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నాను. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ముందుజాగ్రత్త చర్యగా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటున్నా. ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన కార్యకర్తలు, అధికారులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా’ అని వర్ష ఏక్నాథ్ గైక్వాడ్ పేర్కొన్నారు.