ముంబై : విద్యుత్ బిల్లులు చెల్లించని వినియోగదారులపై మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా ఆపేస్తామని ఆయన హెచ్చరించారు. అకోలాలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి నితిన్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
లాక్డౌన్ సమయంలో మీరు(ప్రజలను ఉద్దేశించి) హాయిగా ఇండ్లలో కూర్చొంటే విద్యుత్ రాత్రింబవళ్లు కష్టపడి మీకు కరెంట్ అందించారు. ఫ్రీజ్లు, కూలర్లు, టీవీలు, ల్యాప్టాప్లు వినియోగించేందుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేశామన్నారు. ఈ క్రమంలో కొంత మంది ఉద్యోగులు తమ ప్రాణాలను కూడా కోల్పోయారని తెలిపారు. ఇప్పటికైనా బిల్లులు చెల్లించి, విద్యుత్ ఉద్యోగులను ఆదుకోవాలన్నారు.