ముంబై : కొవిడ్-19 థర్డ్ వేవ్ ను సమర్ధంగా కట్టడి చేసేందుకు మౌలిక వసతులను మెరుగుపరుచుకునేలా మహారాష్ట్రలో లాక్డౌన్ ను పొడిగించాలని మంత్రి అస్లాం షేక్ బుధవారం పేర్కొన్నారు. విదేశాల నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు వెసులుబాటు కల్పిస్తూ దిగుమతి చట్టాలను సడలించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రాలు విదేశాల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకువచ్చి సంబంధిత ప్రోటోకాల్స్ కు సడలింపు ఇవ్వాలని అన్నారు. ఈ దిశగా కేంద్రం చర్యలు చేపడితే మూడు నాలుగు నెలల్లో తాము ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని చెప్పారు. ఇక గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 40,596 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.