ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. గత వారం నుంచి 40 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 46,406 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకుపైగా కొనసాగుతున్నది. కాగా, 36 మంది కరోనా వల్ల మరణించారు. 34,658 మంది రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే గురువారం కొత్తగా ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,367 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
మరోవైపు ఒక్క ముంబైలోనే కొత్తగా 13,702 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 95,123కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 9,69,989కు పెరిగింది. గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 16,426కు చేరింది.
గురువారం 20,849 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు వైద్య అధికారులు తెలిపారు. దీంతో ముంబైలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,55,811కు చేరిందని వివరించారు.