ముంబై, ఫిబ్రవరి 25: ధారావి రీడెవలప్మెంట్పై గతంలో దాఖలైన టెండర్ను రద్దు చేసి తాజాగా టెండర్ను పిలవడానికి పలు కారణాలున్నాయని, నిర్దేశించిన ఒక సంస్థ (అదానీ)కు కాంట్రాక్టును కట్టబెట్టడానికి ఈ చర్యకు పాల్పడ్డామనటంలో వాస్తవం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు నివేదించింది. టెండర్లో ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందని అమెరికాకు చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ హైకోర్టును ఆశ్రయించింది. 2018లో ఈ ప్రాజెక్టును రూ.7,200 కోట్ల టెండర్కు దక్కి ంచుకొన్నామని, అయితే, అదానీ సంస్థకు ప్రాజెక్టు కట్టబెట్టడానికి తమ కాంట్రాక్టును రద్దు చేశారని ఆరోపించింది. దీనిపై సమగ్ర వివరాలతో దాఖలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొవిడ్ ఉద్ధృతి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి-డాలర్ రేట్, పెరిగిన వడ్డీ రేట్లు తదితర అంశాల వల్లే కొత్త టెండర్ను పిలిచామని పేర్కొన్నది. దీంతో హెక్లింక్ వాదనలు మార్చి 14న వింటామని పేర్కొన్న హైకోర్టు.. కేసును వాయిదా వేసింది.