ముంబై: మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) తన బాబాయ్, ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్తో (Sharad Pawar) భేటీ అయ్యారు. సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తన క్యాబినెట్ను విస్తరించిన (Cabinet expansion) కొన్ని గంటల్లోనే ఆయన శరద్ ఇంటికి వెళ్లడం గమనార్హం. ఈ నెల 2న ఎన్సీపీ చీల్చి అధికార కూటమిలో చేరిన తర్వాత శరద్ పవార్తో సమావేశమవడం ఇదే మొదటిసారి. అయితే ఈ భేటీ వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, కేవలం తన చిన్నమ్మను పరామర్శించడానే అజిత్ ఆ ఇంటికి వెళ్లారని ఎన్సీపీ చీలికవర్గం నేతలు వెల్లడించారు. శరద్ పవార్ సతీమణి ప్రతిభ (Pratibha) .. సర్జరీ అనంతరం శుక్రవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యారు.
ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసిన అజిత్ పవార్.. ఈ నెల 2న ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరారు. అదే రోజున ఆయన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, మిగిలిన ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా వారందరికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శుక్రవారం శాఖలు కేటాయించారు.
అజిత్ పవార్కు ఆర్థిక శాఖ దక్కగా, ఆయనతో కలిసి ఎన్సీపీని వీడిన సీనియర్ నేత చగన్భుజ్బల్కు ఆహార, పౌరసరఫరాల శాఖను అప్పగించారు. గతంలో మహా కూటమి ప్రభుత్వంలో కూడా భుజ్బల్ అదే శాఖ బాధ్యతలు నిర్వహించారు. ఇక మరో క్యాబినెట్ మినిస్టర్ దనంజయ్ ముండేకు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా అజిత్ వర్గానికి ప్రభుత్వంలోని ప్రధాన శాఖలైన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, ఆహార, పౌరసరఫరాలు, సహకార, మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయం, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, వైద్య విద్య శాఖలు దక్కాయి.
#WATCH | Mumbai: Maharashtra Deputy Chief Minister Ajit Pawar leaves from NCP chief Sharad Pawar's residence Silver Oak. pic.twitter.com/qt6mdCuX9M
— ANI (@ANI) July 14, 2023