ముంబై : కరోనా మహమ్మారి వెంటాడుతున్నా దేశ ఆర్ధిక రాజధాని ముంబై రోడ్లపై వాహనాలు బారులు తీరడంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే జనం విపరీతంగా రోడ్ల పైకి వస్తే ముంబైలో లాక్ డౌన్ తరహా కఠిన నియంత్రణలు అమలు చేస్తామని ఠాక్రే సోమవారం హెచ్చరించారు. కొవిడ్-19 నియంత్రణలను ఎత్తివేసినట్టు తాను ప్రకటించలేదని, ప్రజలు ఇలాగే వ్యవహరిస్తే ముంబైలో కఠిన నియంత్రణలు అమలవుతాయని స్పష్టం చేశారు.
బాంద్రా శివార్లలో రెండు మెట్రో లైన్లలో ట్రయల్ రన్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్బంగా ఠాక్రు ప్రసంగించారు. కాగా రాష్ట్రంలో జూన్ 15 వరకూ లాక్ డౌన్ తరహా నియంత్రణలను మహారాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కొవిడ్-19 పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల లభ్యత ఆధారంగా సడలింపులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.