న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ విస్తరణను మంగళవారం చేపట్టనున్నట్లు సమాచారం. 12 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉందని, మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు హోంశాఖ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పని చేసిన ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసిన అనంతరం.. జూన్ 30న శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం స్వీకారం చేశారు. బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు మాజీ మంత్రులకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. అప్పటి నుంచి ప్రభుత్వం ఇద్దరు కేబినెట్ సభ్యులతో పని చేస్తున్నది. ఇద్దరితోనే ప్రభుత్వం కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి.