ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పది రోజుల్లోనే 241 శాతం కేసులు పెరిగాయి. జూన్ 3న 5,127 కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య నేటికి 17,480కి చేరింది. ఆ రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతంగా ఉంది. ఈ ఏడాది మే నెలలోనే 9,354 కేసులు నమోదు కాగా, 5,980 కేసులు ముంబై నుంచే ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. గత నెలలో కొవిడ్తో 17 మంది చనిపోయినట్లు వెల్లడించారు.
జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు మహారాష్ట్రలో మొత్తం 23,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 14,945 కేసులు ముంబైలోనే నమోదు అయ్యాయి. జూన్ 1 నుంచి 12 వరకు 12 మంది చనిపోయారు. అయితే ఇటీవల నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే.. స్వల్ప లక్షణాలే బయటపడుతున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.