శ్రీనగర్, ఆగస్టు 21: అఫ్గానిస్థాన్ను చూసి పాఠం నేర్చుకోవాలని కేంద్రానికి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సూచించారు. కశ్మీర్లో చర్చలు నిర్వహించాలని, 2019లో రద్దు చేసిన ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమను పరీక్షించవద్దని హెచ్చరిస్తూ కేంద్రం తప్పును చక్కదిద్దుకోవాలన్నారు. సూపర్పవర్ అయిన అమెరికా మూటాముల్లె సర్దుకొని (అఫ్గానిస్థాన్ నుంచి) పారిపోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆమె విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించింది.