లడఖ్: హిమాలయ పర్వత శ్రేణుల్లో మరోసారి భూమి కంపించింది. శనివారం తెల్లవారుజామున లడఖ్లోని కార్గిల్లో (Kargil) భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదయింది. భూకంప కేంద్రం కార్గిల్కు 169 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో జనాలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కూడా భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 3.42 గంటలకు రాజధాని ఐజ్వాల్ సహా మిజోరం అంతా భూ ప్రకంపణలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదయిందని ఎన్సీఎస్ తెలిపింది. భూకంప కేంద్రం మిజోరం, మయన్మార్ సరిహద్దుల్లోని చంపయ్ జిల్లాలో ఉందని వెల్లడించింది.