అడవి జంతువుల దాడివలో చనిపోయన వాళ్ల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం రెండింతలు చేసింది. ఇకనుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.8 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వనుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బంధవ్ఘర్ జాతీయ పార్క్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు అడవి జంతువుల దాడిలో కొందరు చనిపోతారు. మరికొందరు గాయపడతారు. అలాంటి సంఘనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మాపైన ఉంది. అయినా కూడా వన్యప్రాణుల దాడిలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ల కుటుంబసభ్యులకు రూ.4 లక్షల బదులు రూ.8 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం’ అని శివరాజ్ సింగ్ అన్నారు. వన్యప్రాణుల్ని సంరక్షించాలని కోరిన ఆయన అందుకు పాటుపడుతున్నవాళ్లను అభినందించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణంలో 25 శాతం అటవీ భూభాగం ఉంటుంది. రాష్ట్రంలో చాలా చోట్ల అప్పుడప్పుడుఅడవిజంతువులు జనావాసాల్లోకి చొరబడడం జరగుతుంది. లాక్డౌన్ తర్వాత పులులు, అడవి ఏనుగుల దాడిలో 13 మంది చనిపోయారు. దాంతో, ప్రభుత్వం అడవి జంతువుల దాడిలో చనిపోయనవాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం ఇంతకుముందు రూ. 4 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేది. ఇప్పుడు శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెండింతలు చేసింది.