రాంచి: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖంద్వా జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. తనను పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిందని ఓ యువకుడు 20 ఏండ్ల యువతిని కత్తితో పొడిచాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖంద్వా జిల్లాలోని ఓ గ్రామంలో బబ్లూ అనే యువకుడు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు.
అతను పనిచేసే ప్రదేశానికి సమీపంలోనే 20 ఏండ్ల యువతి తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో గత సోమవారం యువతి తల్లిదండ్రులు వారి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. బాధితురాలు ఆమె అక్క మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో అక్కచెల్లెండ్లు ఇద్దరూ బకెట్లతో ఇంట్లోకి నీళ్లు మోస్తున్నారు.
ఇది గమనించిన వాచ్మెన్ బబ్లూ.. తన పెండ్లి ప్రతిపాదనను తిరస్కరించిందన్న కసితో యువతిని చంపేయాలిని నిర్ణయించుకున్నాడు. సదరు యువతి అక్క నీళ్ల బకెట్తో ఇంట్లోకి వెళ్లగానే.. ఆమె వెనుకాలే వెళ్తున్న చెల్లిపై బబ్లూ కత్తితో దాడిచేశాడు. విచక్షణారహితంగా ఆమెను కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి సమీపంలోని ఇందిరా సాగర్ డ్యామ్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు.
తీవ్రంగా గాయపడిన యువకుడిని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. అయినా ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిపారు.