భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వరదలో చిక్కుకున్నారు. దీంతో వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్తో ఆయనను కాపాడారు. దాటియా జిల్లాలో భారీ వర్షాలు కురువడంతో వరదలు పోటెత్తాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించడానికి హోంమంత్రి పడవలో పర్యటించారు. ఈ క్రమంలోఓ ఇంటికప్పుపై 9 మంది సహాయం కోసం ఎదురుచూస్తుండటాన్ని మంత్రి గమనించారు. ఆ ఇంటి చుట్టూ నీళ్లు ఉండటంతో అక్కడికి వెళుతుండగా ఓ చెట్టు విరిగి పడవపై పడింది. వెంటనే వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ అక్కడికి చేరుకొని మంత్రిని, ఇంటిపైనున్న వారినీ రక్షించింది.