మండ్లా: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సోమవారం మండ్లాలో జరుగుతున్న జన్జాతీయ గౌరవ్ దివస్ ఉత్సవంలో పాల్గొన్నాడు. ఈ వారం రోజుల ఉత్సవాలు ఈ నెల 15న ప్రారంభమై 22న ముగిశాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన నాయకుడు బిర్సాముండా జయంతి కూడా ఈ వారంలోనే రావడం యాదృచ్ఛికమే. అయితే, ఈ జనజాతీయ గౌరవ దివస్లో పాల్గొన్న శివరాజ్సింగ్ గిరిజనులతో కలిసి సరదాగా గడిపారు. డోలు వాయిస్తూ నత్యం చేశారు.
అంతకుముందు గోండు తెగ రాజులు శంకర్ షా, రఘునాథ్ షాల విగ్రహాల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ శంకుస్థాపన చేశారు. మొదటి స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో 1857, సెప్టెంబర్ 18న ఆ ఇద్దరిని బ్రిటీషర్లు ముక్కలుముక్కలుగా నరికి చంపించారు. కాగా, మండ్లాలో శివరాజ్సింగ్ డోలు వాయిస్తూ డ్యాన్స్ చేసిన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.