భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్సింగ్ చౌహాన్ బుధ్ని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బుధ్ని నియోజకవర్గంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజైన అక్టోబర్ 30న ఆయన నామినేషన్ వేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
Madhya Pradesh CM Shivraj Singh Chouhan files nomination from Budhni Assembly constituency pic.twitter.com/JjblHkfztF
— ANI (@ANI) October 30, 2023
అదేవిధంగా బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఇండోర్-1 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నాడు. విజయవర్గీయ నామినేషన్ దాఖలుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Indore | BJP leader Kailash Vijayvargiya files his nomination for the upcoming elections in Madhya Pradesh
The party has fielded him from the Indore-1 assembly constituency. pic.twitter.com/twOAzcOUS1
— ANI (@ANI) October 30, 2023
కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరుగనున్నాయి. అందుకోసం ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదలైంది. ఆ రోజు నుంచి నామినేషన్ల దాఖలు మొదలైంది. అక్టోబర్ 30 నామినేషన్ల దాఖలుకు తుది గడువు. అక్టోబర్ 31 దాఖలైన నామినేషన్లను స్క్రూటినీ చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 2. నవంబర్ 17న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.
కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ కమల్నాథ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, కొన్ని నెలలకే యువ నాయకుడు జ్యోతిరాధిత్య సింథియా పార్టీని చీల్చడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. సింథియా వర్గం ఎమ్మెల్యేల సహకారంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.