న్యూఢిల్లీ, జనవరి 26: భారత గణతంత్ర దిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ భారత విద్యార్థులకు తీపి కబురు అందించారు. 2030 నాటికి ఫ్రాన్స్లో 30 వేల మంది భారత విద్యార్థులు చదవాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు.
‘ఇది ఉన్నతమైన లక్ష్యం, కానీ దీన్ని సాకారం చేయాలని నేను నిర్ణయించుకున్నాను’ అని ఎక్స్లో శుక్రవారం ఆయన పోస్ట్ చేశారు. తమ దేశ విశ్వవిద్యాలయాల్లో చదువుకొనే ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం అంతర్జాతీయ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఫ్రాంచైజీల నెట్వర్క్ అభివృద్ధి చేస్తామన్నారు. ‘మా దేశంలో చదువుకున్న మాజీ భారత విద్యార్థులకు వీసా మంజూరు చేయడాన్ని సులభతరం చేస్తాం’ అని మెక్రాన్ పేర్కొన్నారు.