Dogs Fear | కొందరికి కుక్కలు ఎంతో ఇష్టం. కుక్కలంటే ఎంతో విశ్వాసంగా ఉంటాయని వాటిని పెంచుకుంటుంటారు. రకరకాల జాతులకు చెందిన ఇష్టంగా సాకుతూ ముద్దు చేస్తుంటారు. మరికొందరికి కుక్కలంటేనే జంకుతుంటారు. ఏకంగా ఓ జంట ఏకంగా కుక్కల భయంతో ఏకంగా ఇంటినే అమ్మకానికి పెట్టారు. ‘కుక్కల భయం’ ఉంటుంది అని పేర్కొంటూ ఇంటి ఎదుట బోర్డు పెట్టడం విశేషం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. లక్డీకపూల్ ప్రాంతంలోని జాంకీపురం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధ దంపతులు కొద్ది రోజుల కిందట ఓ ఇంటిని కొనుగోలు చేశారు.
ఆ ఇంటి పక్కింట్లో కుక్కల బెడదతో ఇబ్బందులుపడుతున్నారు. పక్కింట్లో ఐదారో కాదు.. ఏకంగా 34 కుక్కలను పెంచుకుంటున్నారు. దాంతో వృద్ధ జంట కుక్కల బెడదతో ఇబ్బందులుపడుతున్నారు. చివరకు విసిగిపోయి నిరసన తెలుపుతూ అమ్మకానికి పెట్టారు. బోర్డుపై ఇంటికి ‘కుక్కల భయం ఉంది. లేనిపోని నిందలు వేసేవారిని భరించలేక ఇంటిని అమ్మేస్తున్నాం. కొనుగోలు చేయాలనుకునే వారు దీక్షా త్రివేదిని సంప్రదించండి’ అంటూ బోర్డుపై పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆ ఇంట్లో 34 కంటే ఎక్కువగానే కుక్కలు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు.
కుక్కలన్నీ రోజంతా బయటే తిరుగుతాయని, ఆ ఇంటి వద్దకు వెళ్లే వారిని వెంబడించడంతో పాటు గతంలో పలువురిని కరిచాయని ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో చేసిన ఫిర్యాదులో 35 పేర్కొనగా.. ఇందులో 34దేశవాళీ కుక్కలు కాగా, ఒకటి విదేశీ జాతికి చెందింది ఉన్నది. అయితే, సదరు ఇంటి వారికి లక్నో మున్సిపల్ కార్పొరేషన్ ఇంటి యజమానికి నోటీసు సైతం జారీ చేసింది. ఇదిలా ఉండగా.. లక్నోలో ఇటీవల పెంపుడు కుక్కల దాడులకు సంబంధించిన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా గతేడాది జులైలో లక్నోలో పిట్బుల్ కుక్క తన యజమాని ప్రాణాలను బలిగొంది.