న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన అరుణ్కుమార్ జాక్పాట్ కొట్టాడు. అబుదాబీ బిగ్ టికెట్ డ్రాలో అతడు కొనుగోలు చేసిన టికెట్కు ఫస్ట్ ప్రైజ్ తగిలింది. దీంతో రూ.44 కోట్ల ప్రైజ్మనీని సొంతం చేసుకోబోతున్నాడు. ఆయన మార్చి 22న ఆన్లైన్లో కొనుగోలు చేసిన లాటరీ టికెట్ మొదటి ప్రైజ్ గెలుచుకుందని ‘గల్ఫ్ న్యూస్’ వెల్లడించింది. బహ్రెయిన్లో ఉన్న భారతీయుడు సురేశ్ మంతన్ రెండో బహుమతి గెలుచుకోవటం గమనార్హం. లాటరీ గెలుచుకోవటంపై అరుణ్ మాట్లాడుతూ, “బిగ్ టికెట్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ కొట్టారని చెప్పారు. ఇది ఒక ప్రాంక్ కాల్ అని ఫోన్ కాల్ను కట్ చేశా. ఆ నంబర్ను బ్లాక్ చేశా. మరో నంబర్ నుంచి విషయం తెలవటంతో అప్పుడు నమ్మా’ అని చెప్పారు.