అయోధ్య, నవంబర్ 1: దాదాపు 8 అడుగుల ఎత్తైన బంగారు పూత పూసిన పాలరాయి సింహాసనంపై రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఈ సింహాసనం మూడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఉంటుందని పేర్కొంది. రాజస్థాన్లో తయారవుతున్న ఈ సింహాసనం వచ్చే నెల 15 నాటికి అయోధ్యకు చేరుకుంటుందని తెలిపింది. గర్భగుడి నిర్మాణ పనులు పూర్తికావొచ్చాయని వెల్లడించింది.