పాట్నా: హనుమంతుడు తన గదతో బీజేపీని మట్టికరిపించాడని, కర్ణాటకలో రాహుల్ను గెలిపించాడని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav ) అన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల మెగా భేటీలో (Opposition meeting) ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘కర్ణాటకలో హనుమంతుడు తన గదతో బీజేపీని మట్టికరిపించాడు. రాహుల్ను గెలిపించాడు. హనుమంతుడు ప్రతిపక్షంతో ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీకి భారీ ఓటమి తప్పదు’ అని అన్నారు. అలాగే తాను ఇప్పుడు పూర్తిగా ఫిట్గా ఉన్నానని, నరేంద్ర మోదీని ఫిట్ చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి భయంకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూలైలో మరోసారి సిమ్లాలో సమావేశమవుతామని లాలూ తెలిపారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఆ సమావేశంలో ఎజెండాను సిద్ధం చేస్తామని చెప్పారు.
కాగా, ప్రతిపక్షాల సమావేశం కేవలం అధికారం కోసం కాదని, విలువలు, భావజాలం కోసమేనని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. జమ్ముకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, భావసారూప్యత కలిగిన ప్రతి పార్టీ ఈ సమావేశంలో పాల్గొన్నదని తెలిపారు. ‘అధికారం కోసం కాదు, విలువలు, భావజాలం కోసం మా పోరాటం’ అని చెప్పారు. వైట్హౌస్లో ప్రజాస్వామ్యం గురించి ప్రధాని మోదీ మాట్లాడటం వినడానికి ఆనందంగా ఉందని ఎద్దేవా చేశారు. అయితే, జమ్ముకశ్మీర్లో ప్రజాస్వామ్యం ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. తాను, మెహబూబా ముఫ్తీ దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేసిన ప్రాంతానికి చెందినవాళ్లమని తెలిపారు. దేశాన్ని విధ్వంసం నుంచి రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావడానికి తామంతా ఇక్కడ సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు.
#WATCH | RJD President Lalu Prasad Yadav after the joint opposition meeting said, "Now I am fully fit and will make Narendra Modi fit…The country's situation is grim at the moment. We will meet again in July in Shimla to prepare an agenda on how to move ahead together while… pic.twitter.com/J3EYnvcLS1
— ANI (@ANI) June 23, 2023
#WATCH | National Conference (NC) leader Omar Abdullah after the joint opposition meeting in Patna said, "…We have met to save the country from devastation and to bring democracy back. I & Mehbooba Mufti belong to that part of the country where democracy is murdered…Yesterday… pic.twitter.com/dCl9jwclKH
— ANI (@ANI) June 23, 2023