మహంత్ స్వామి అనికేత్ శాస్త్రి
నాసిక్, మే 30: ఒకవైపు జ్ఞానవాపీ మసీదు వివాదం కొనసాగుతుండగా హనుమాన్ జన్మస్థలం అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఆంజనేయస్వామి జన్మస్థలం మహారాష్ట్రలో నాసిక్లోని అంజనేరి కాదని, కర్ణాటకలోని కిష్కింధలో మారుతి పుట్టాడని కర్ణాటకకు చెందిన శ్రీమండలాచార్య పీఠాధీశ్వర్ మహంత్ స్వామి అనికేత్ శాస్త్రి దేశ్పాండే మహరాజ్ అన్నారు. దీనిపై చర్చించేందుకు మంగళవారం నాసిక్లో ధర్మసంసద్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.