న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని బీటుల్ నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి మృతిచెందాడు. దీంతో ఆ స్థానానికి లోక్సభ ఎన్నిక(Loksabha Poll)ను వాయిదా వేశారు. వాస్తవానికి ఏప్రిల్ 26వ తేదీన బీటుల్ స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉన్నది. అయితే బీఎస్పీ అభ్యర్థి మృతి నేపథ్యంలో ఆ ఎన్నికను మే 7వ తేదీన నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9వ తేదీన బీఎస్పీ అభ్యర్థి మృతిచెందారు. 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం ఎన్నికను వాయిదా వేసినట్లు ఈసీ తెలిపింది. ఎన్నికలకు ముందు ఒకవేళ జాతీయ పార్టీ లేదా గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి చనిపోతే, అప్పుడు కొత్త అభ్యర్థిని ప్రకటించడం కోసం ఎన్నికను వాయిదా వేస్తారు. బీఎస్పీ జాతీయ గుర్తింపు ఉన్న పార్టీ.