న్యూఢిల్లీ: అటవీ సంరక్షణ సవరణ బిల్లు(Forest Conservation Amendment Bill) ఇవాళ లోక్సభలో పాసైంది. దేశ సరిహద్దుల వద్ద సుమారు వంద కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న అటవీ సంరక్షణ చట్టాల్ని మినహాయించాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో జూలు, సఫారీలు, ఎకో టూరిజం సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా కొత్త చట్టాన్ని రూపొందించారు. స్వల కాల చర్చ తర్వాత అటవీ పరిరక్షణ సవరణ బిల్లు 2023కి ఆమోదం తెలిపారు. పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ బిల్లుపై మాట్లాడారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖకు100 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న అడవుల్లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు నిర్మించే రీతిలో చట్టాన్ని సవరించారు. బిల్లు పాసైన తర్వాత లోక్సభ గురువారానికి వాయిదా పడింది.