Lok Sabha polls : లోక్సభ ఆరో విడత ఎన్నికల్లో దాదాపుగా 61.20 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఎన్నికల సంఘం డాటాను షేర్ చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల సిబ్బంది తిరుగుప్రయాణం అయ్యారని, వారి నుంచి తుది వివరాలు అందిన తర్వాత పోలింగ్ శాతం డాటా మరోసారి అప్డేట్ అయ్యే అవకాశం ఉందని ఈసీ పేర్కొంది.
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించిన డాటా ప్రకారం.. పశ్చిమబెగాల్లో అత్యధికంగా 79.47 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఒడిశాలో 69.56 శాతం, జార్ఖండ్లో 63.76 శాతం, హర్యానాలో 60.40 శాతం, ఢిల్లీలో 57.67 శాతం, బీహార్లో 55.24 శాతం, జమ్ముకశ్మీర్లో 54.30 శాతం, ఉత్తరప్రదేశ్లో 54.03 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆరో విడతలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 58 నియోజకవర్గాల్లో 889 మంది బరిలో నిలిచారు. జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. దాంతో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. జూన్ 4న ఫలితాల వెల్లడి అనంతరం లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.