కోల్కతా: లోక్సభ ఎన్నికల వేళ తృణమూల్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆ పార్టీ డిప్యూటీ చీఫ్ విప్ తపస్రాయ్ ఎమ్మెల్యే పదవికి సోమవారం రాజీనామా చేశారు. పార్టీతోపాటు సీఎం మమతాబెనర్జీ తీరు తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాజీనామా లేఖను స్పీకర్కు సమర్పించారు. అంతకుముందు ఆయనను బుజ్జగించేందుకు పార్టీ నేతలు బ్రత్య బసు, కుణాల్ ఘోష్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తనపై ఈడీ దాడులు జరిపినా ముఖ్యమంత్రి కనీసం పలకరించలేదని తపస్రాయ్ పేర్కొన్నారు. తపస్రాయ్ బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది.