Lok Sabha Elections : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్న లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డి తరఫున సీఎం సిద్ధరామయ్య ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడుము బెల్టులో తుపాకీతో వచ్చిన ఓ వ్యక్తి సీఎం ముందే హల్చల్చేశాడు. బెంగళూరులోని విల్సన్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సీఎం సిద్ధరామయ్య, మంత్రి రామలింగారెడ్డి, ఆయన కూతురు సౌమ్యారెడ్డి నిలబడి ఉన్న ఓపెన్ టాప్ వాహనం బానెట్పైకి ఎక్కి ఆ వ్యక్తి హడావిడి చేశాడు. సీఎం మినహా అయన పక్కన ఉన్న అందరికీ పూల మాలలు వేశాడు. అనంతరం వాహనం పైనుంచి కిందకు దూకాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మారణాయుధం ధరించి ఉన్న వ్యక్తి సీఎంకు అత్యంత సమీపంలోకి ఎలా వెళ్లగలిగాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన భద్రతాలోపాన్ని ఎత్తిచూపుతోంది.
కాగా, తుపాకీతో సీఎం దగ్గరికి వెళ్లిన వ్యక్తిని రియాజ్గా పోలీసులు గుర్తించారు. ఆత్మరక్షణ కోసం అతను కొన్నేళ్ల నుంచి తుపాకీని వెంటపెట్టుకుంటున్నాడని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో లైసెన్స్డ్ తుపాకులను పోలీసులకు అప్పగించాల్సి ఉన్నప్పటికీ.. అతనికి పొంచి ఉన్న ముప్పు తీవ్రత కారణంగా తన తుపాకీని పోలీసులకు అప్పగించకుండా మినహాయింపు పొందాడని వెల్లడించారు.
లైసెన్స్డ్ తుపాకీ కలిగి ఉంటే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి సమీపంలోకి అతడిని ఎలా చేరుకోనిస్తారని పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. ఇది కచ్చితంగా నిఘా లోపమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇదిలావుంటే సిద్ధరామయ్యకు పోకిరీలు, రౌడీలు మాత్రమే పూల మాలలు వేస్తారని బీజేపీ విమర్శిస్తోంది.
Major security breach. The man with the katta onboard the same vehicle as Karnataka CM Siddaramiah is a congress worker.
The gun wielding man garlanded the Transport Minister Ramalinga Reddy standing next to him. pic.twitter.com/OnyK4gWH7R
— Sneha Mordani (@snehamordani) April 9, 2024