లక్నో, జనవరి 30: యూపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే 16 మంది అభ్యర్థుల మొదటి జాబితాను సమాజ్వాది పార్టీ మంగళవారం ప్రకటించింది. మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి, ప్రస్తుత ఎంపీ డింపుల్ యాదవ్.. మైన్పురి నుంచి పోటీచేయనున్నారు.
ఒక పక్క సీట్ల షేరింగ్పై కాంగ్రెస్తో చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న క్రమంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మొదటి జాబితాను విడుదల చేయడం గమనార్హం. తమ పార్టీకి ఏది మంచిదని భావిస్తామో దానినే అమలు చేస్తామని, దానికి కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆరు సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ చూపిన నిర్లక్ష్య వైఖరికి ప్రతీకారంగానే అఖిలేశ్ ఈ చర్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.