Election Notification | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ బుధవారం ప్రారంభం కానున్నది. ఏడు దశల్లో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో తొలి దశ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో తొలి దశలో 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. అత్యధికంగా తమిళనాడులో 39 స్థానాలకూ ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. వచ్చే నెల 19న పోలింగ్ జరుగుతుంది.
మార్చి 20న ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం జారీ చేస్తుంది. ఈ నెల 27తో నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. మార్చి 28న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 30న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. వచ్చేనెల 19న పోలింగ్ జరుగనున్నది.
తమిళనాడులో 39 స్థానాలు, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదేసి స్థానాలు, బీహార్ లో నాలుగు, పశ్చిమ బెంగాల్ లో మూడు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండేసీ స్థానాలు, ఛత్తీస్ గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది.