న్యూఢిల్లీ: లోక్సభ ( Lok Sabha ) నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్సభ చివరిసారి సమావేశమైంది. నిజానికి ఈనెల 13 వరకు సభలు జరగాల్సి ఉంది. కానీ గత రెండు వారాల నుంచి విపక్షాలు సభలో ఆందోళన సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సభా కార్యక్రమాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఇవాళ విపక్షాల తీరును తప్పుపట్టారు. ఈ సెషన్లో ఎన్ని గంటల పాటు సభా కార్యక్రమాలు జరిగాయో ఆయన వెల్లడించారు. ఈసారి సభా కార్యక్రమాలను అనుకున్నట్లు సాగలేదని, కేవలం 22 శాతం మాత్రమే ప్రొడక్టివిటీ రికార్డు అయ్యిందన్నారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ మృతికి సంతాపం తెలిపారు. లోక్సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మంగళవారం లోక్సభలో 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మరోవైపు ఇవాళ రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా పడింది.