లక్నో: భక్తులు పవిత్ర స్నానం ఆచరించే గంగా ఘాట్లో మొసలి కనిపించింది. దీంతో ఆ ఘాట్లోకి దిగేందుకు భక్తులు భయపడ్డారు. చివరకు మత్య్సకారులు ఆ మొసలిని బంధించారు. (Locals Capture Crocodile) అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి దానికి పూజలు చేశారు. అలాగే ఆ మొసలితో కొందరు సెల్ఫీలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. గంగా నదిలోని భైరవ్ ఘాట్ వద్ద పెద్ద మొసలి కనిపించింది. దీంతో పవిత్ర స్నానం కోసం ఘాట్లోకి దిగేందుకు భక్తులు భయపడ్డారు. మొసలి గురించి అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు స్పందించక పోవడంతో చివరకు మత్స్యకారులు దానిని పట్టుకుని బంధించారు.
కాగా, బంధించిన మొసలిని స్థానికులు ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన జనం దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో గుడికి వచ్చారు. కొందరు భక్తులు ఆ మొసలికి బొట్టు పెట్టి, హారతులు ఇచ్చి పూజలు చేశారు. మరి కొందరు దాని వద్ద సెల్ఫీలు దిగారు.
మరోవైపు ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చాలా సేపటి తర్వాత వచ్చిన వారు ఆ మొసలిని తమ వెంట తీసుకెళ్లారు. సురక్షిత నదీ జలాల్లో విడిచిపెడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా గంగా నది ఘాట్లో మొసలి కనిపించడం, పట్టుకుని బంధించిన దానికి పూజలు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दहशत बना था, आज पकड़ा गया, अस्पताल घाट में मछुवारों ने पकड़ा। #kanpur https://t.co/m1qLB0Lsvp pic.twitter.com/4OUZDABWjx
— Rahul Shukla (Senior photojournalist ) (@PTIrahulshukla) January 31, 2024