LK Advani | న్యూఢిల్లీ: రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వచ్చే ఏడాది జనవరిలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదు. ఇరువుల నేతల వయసు, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని వారిని ప్రారంభోత్సవానికి రావొద్దని కోరామని, అందుకు వారు అంగీకరించినట్టు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. మందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు.