(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ): అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పథకాన్ని బ్యాంకు ఖాతాలకు అనుసంధానం విషయంలో బ్యాంకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. టార్గెట్లు చేరుకోవడం కోసం సంబంధిత ఖాతాదారుల అనుమతి లేకుండా వారి ఖాతాలకు ఈ స్కీమ్ను లింక్ చేస్తున్నాయి. అకౌంట్ హోల్డర్ల అనుమతి పత్రం లేకుండానే, వారి ఖాతాల నుంచి డబ్బులను విత్డ్రా చేస్తున్న బ్యాంకులు.. వాటిని ఏపీవై పథకానికి చందాలు కడుతున్నారని ప్రభుత్వ మేధో సంస్థ ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్) నివేదిక పేర్కొన్నది. దీంతో 32 శాతం మంది సబ్స్ర్కైబర్లు డ్రాపౌట్ అయ్యారని తమ అధ్యయనంలో వెల్లడైందని ఐసీఏస్ఎస్ఆర్ తెలిపింది.